బాలుడి అదృశ్యం

ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST

బాలుడి అదృశ్యం

బాలుడి అదృశ్యం

కులకచర్ల, జూలై2: ఓ బాలుడు అదృశ్యమైన ఘటన కులకచర్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బడిగె జంగం ఎల్లప్ప, దండెమ్మల కుమారుడు ప్రసాద్‌(13) స్థానిక కేవీఎం పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా, శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రసాద్‌ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు గ్రామంలో, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం బాలుడి తండ్రి ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ్‌సలు తెలిపారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST