దివ్యాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2022-08-09T06:58:15+05:30 IST

దివ్యాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి

దివ్యాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి

 స్పందనలో జనసేన నాయకుల వినతి

వన్‌టౌన్‌: నగరంలో రద్దయిన దివ్యాంగుల పెన్ష న్లను పునరుద్ధరించాలని సోమవారం స్పందనలో కలెక్టర్‌ దిల్లీరావుకు జనసేన నాయకులు పొట్నూరి శ్రీనివాసరావు, బావిశెట్టి శ్రీనివాస్‌ వినతిపత్రం అం దించారు. జనసేన సభ్యత్వం ఉందన్న కారణంతో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన దివ్యాంగురాలు ఇరుపురి ప్రశాంతి 18 ఏళ్లుగా తీసుకుంటున్న పెన్షన్‌ను, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తీసేయించారని వారు ఆరోపించారు. ఆమెకు న్యాయం చేయాలని, ఇంకా తొలగించిన దివ్యాంగుల పెన్షన్‌ పునరుద్ధరించాలని కోరారు. పార్టీ, కులం చూడమంటూ సీఎం జగన్‌ చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలకు పొంతన లేదని నాయకులు విమర్శించారు. కలెక్టర్‌ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

Updated Date - 2022-08-09T06:58:15+05:30 IST