షాహిదా హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-11-30T05:44:00+05:30 IST

మండలంలోని చాపిరి గ్రామ యువతి షాహిదా హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు దిశ డీఎస్పీ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం స్థానిక రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో స్థానిక డీఎస్పీ రమ్య, సీఐ శివశంకర్‌నాయక్‌లతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.

షాహిదా హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌

కళ్యాణదుర్గం, నవంబరు 29: మండలంలోని చాపిరి గ్రామ యువతి షాహిదా హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు దిశ డీఎస్పీ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం స్థానిక రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో స్థానిక డీఎస్పీ రమ్య, సీఐ శివశంకర్‌నాయక్‌లతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఇదివరకే ప్రధాన నిందితుడు రఘుతో పాటు చిన్నాన్నలు ఆనంద్‌, రాజశేఖర్‌, తల్లి లింగమ్మ, పిన్నమ్మ విశాలమ్మలపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. హత్యకు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో నిందితుడు రఘు తండ్రి ఎర్రిస్వామి, చిన్నాన్న సోమశేఖర్‌, పిన్నమ్మ రాధికలపై కూడా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 8 మంది నిందితులను రిమాండ్‌కు పంపామన్నారు. త్వరలోనే వారిని పోలీస్‌ కస్టడికి తీసుకుని మరోసారి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరతిగతిన విచారణ పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.


Updated Date - 2020-11-30T05:44:00+05:30 IST