మూడు నెలల్లో మరో ప్రాజెక్ట్
ABN , First Publish Date - 2021-01-16T05:38:14+05:30 IST
లాక్డౌన్ తరువాత మెగా ఫ్యామిలీ నుంచి సాయిథరమ్ తేజ హీరోగా విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా దర్శకుడు బి.సుబ్బు శుక్రవారం రాత్రి ఉపమాక విచ్చేశారు.
‘సోలో బ్రతుకే సో బెటర్’ దర్శకుడు సుబ్బు
నక్కపల్లి, జనవరి 15 : లాక్డౌన్ తరువాత మెగా ఫ్యామిలీ నుంచి సాయిథరమ్ తేజ హీరోగా విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా దర్శకుడు బి.సుబ్బు శుక్రవారం రాత్రి ఉపమాక విచ్చేశారు. తొలుత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తన తాతగారి ఊరైన ఉపమాక రావడం ఆనందంగా ఉందన్నారు. లాక్డౌన్ అనంతరం తాను దర్శకుడిగా ఎస్వీసీసీ బ్యానర్పై నిర్మితమైన సినిమా విడుదల కావడంతో అనూహ్య స్పందన లభించిందన్నారు. ఊసరవెళ్లి, మజ్ను వంటి ఆరు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసినట్టు చెప్పారు. నేరుగా ఒక పెద్ద హీరోతో సినిమా తీయగలడం వెనుక ఎస్వీసీసీ బ్యానర్ బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సాయిథరమ్ తేజ సహకారం గొప్పదన్నారు. మరో మూడు నెలల్లో మరో సినిమా ఇదే బ్యానర్లో ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదన్నారు.