పేదలకు ఇళ్ల పట్టాలు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2020-08-11T09:40:24+05:30 IST

పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కన్వేయన్స్‌ డీడ్‌లను సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ..

పేదలకు ఇళ్ల పట్టాలు సిద్ధం చేయాలి

జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాలు


గుంటూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కన్వేయన్స్‌ డీడ్‌లను సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లతో  కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జేసీ సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మూడు రోజుల్లో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఇళ్ల పట్టాలపై ఫొటోలు, ఇంటి నెంబర్లు, పేర్లు తప్పులు లేకుండా ముద్రించేలా చూడాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను మంగళవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎన్‌వీవీ సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-11T09:40:24+05:30 IST