దిశా.. నిర్దేశం
ABN , First Publish Date - 2021-10-20T07:13:06+05:30 IST
ప్రపంచ ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనృసింహుడి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించారు.
యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్
మంత్రులు, స్థపతులతో కలిసి పనుల పరిశీలన
ప్రధాన ఆలయం, పరిసరాలన్నింటినీ క్షుణ్నంగా తిలకించిన సీఎం
పనులు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశం
ప్రపంచ ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనృసింహుడి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించారు. హెలీప్యాడ్ ద్వారా టెంపుల్ సిటీకి చేరుకున్న ఆయన తొలుత ఏరియల్వ్యూ ద్వారా క్షేత్ర పరిసరాలను వీక్షించారు. అక్కడి నుంచి పలువురు మంత్రులతోపాటు కాన్వాయ్లో ఘాట్రోడ్డు ద్వారా సీఎం నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. వేద పండితులు, అర్చకులు ఆలయమర్యాదలతో స్వాగతంపలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
యాదాద్రి టౌన్