మిగిలిన సీట్లకు.. నేరుగా ప్రవేశాలు..!

ABN , First Publish Date - 2021-12-03T14:29:23+05:30 IST

పలు కోర్సుల్లో..

మిగిలిన సీట్లకు.. నేరుగా ప్రవేశాలు..!

హైదరాబాద్‌: పలు కోర్సుల్లో మిగిలిన సీట్లకు నేరుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని తెలుగు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. రాజమండ్రి ప్రాంగణంలో ఎంఎఫ్ఏ(పెయింటింగ్‌), ఎంఏ అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌, ఎంఏ మ్యూజిక్‌, ఎంపీఏ డ్యాన్స్‌, ఫోక్‌ ఆర్ట్స్‌, థియేటర్‌ ఆర్ట్స్‌, ఎంఏ తెలుగు.. కూచిపూడి ప్రాంగణంలో ఎంఏ హిస్టరీ, శ్రీశైలం ప్రాంగణంలో పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సుల్లో సీట్లున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 7న సాయంత్రం 5గంటలలోపు రూ.600ల డీడీతో దరఖాస్తును సంబంధిత ప్రాంగణంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆయా ప్రాంగణాల్లో సంప్రదించాలని కోరారు.


కాగా.. జాతీయ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి తెలిపారు. సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీం కింద కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు డిసెంబరు 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

Updated Date - 2021-12-03T14:29:23+05:30 IST