కర్నాటకలో Bjp మట్టికొట్టుకుపోవడం ఖాయం : నిప్పులు గక్కిన స్వామీజీ

ABN , First Publish Date - 2021-07-27T00:22:34+05:30 IST

బీజేపీ అధిష్ఠానంపై బాలేహోసూర్ పీఠానికి చెందిన స్వామీజీ తీవ్రంగా మండిపడ్డారు. చాలా బాధపడుతూ యడియూరప్ప ముఖ్యమంత్రి

కర్నాటకలో Bjp మట్టికొట్టుకుపోవడం ఖాయం : నిప్పులు గక్కిన స్వామీజీ

బెంగళూరు : బీజేపీ అధిష్ఠానంపై బాలేహోసూర్ పీఠానికి చెందిన స్వామీజీ తీవ్రంగా మండిపడ్డారు. చాలా బాధపడుతూ యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఆయన కన్నీళ్లతో కర్నాటకలో బీజేపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. బీజేపీ ఈ ఆలోచనను పునరాలోచించుకోవాలని సూచించారు. యడియూరప్పను తొలగించి, చాలా పెద్ద తప్పు చేసిందని, దీని ఫలితం బీజేపీ తప్పకుండా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘ముందూ వెనుక ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవిలో యడియూరప్పనే కొనసాగించాలని మేం డిమాండ్ చేశాం. కానీ అధిష్ఠానం వినలేదు’’ అని బాలేహోసూర్ స్వామీజీ అన్నారు. 

Updated Date - 2021-07-27T00:22:34+05:30 IST