Dilsukhnagarలో దారుణం

ABN , First Publish Date - 2022-05-26T00:28:56+05:30 IST

దిల్సుఖ్నగర్లో దారుణం జరిగింది. గణేష్ లాడ్జ్లో పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు యత్నించారు.

Dilsukhnagarలో దారుణం

హైదరాబాద్: దిల్సుఖ్నగర్లో దారుణం జరిగింది. గణేష్ లాడ్జ్లో పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరు పిల్లలతో సహా శశికుమార్ దంపతులు నిద్రమాత్రలు మింగారు. దీంతో లాడ్జ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో శశికుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 2019లో టీఎస్ జెన్కో నుంచి జీవీపీఆర్ సంస్థ రూ.2 కోట్ల కాంట్రాక్టు తీసుకుంది. సబ్ కాంట్రాక్టు కింద జీవీపీఆర్ సంస్థ శశికుమార్కు అప్పగించింది. శశికుమార్ పనులు చేసినా జీవీపీఆర్ ప్రతినిధి ప్రతాప్ రెడ్డి బిల్లులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. డబ్బులు అడిగితే ప్రతాప్ రెడ్డి, అతని కుమారుడు దినేష్రెడ్డి బెదిరింపులకు దిగారని చెబుతున్నారు. జీవీపీఆర్ యాజమాన్యం కాంట్రాక్టు డబ్బులు చెల్లించలేపోవడంతో శశికుమార్ మనస్తాపం చెందాడని చెబుతున్నారు. 

Updated Date - 2022-05-26T00:28:56+05:30 IST