అల్లరి నరేష్ చాలా గ్యాప్ తర్వాత 'నాంది' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రేక్షకాదరణతో విజయవంతంగా రన్ అవుతోంది. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్రాజు చూసి టీమ్ అందరినీ అభినందించడానికి హైదరాబాద్ దసపల్లా హోటల్లో 'నాంది అప్రిసియేషన్ మీట్'ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.
మంచి టీమ్తో ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు
ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ.. ''నా 20 ఏళ్ల కెరీర్లో మొదటిసారి ఒక సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా సినిమా చూసి నాకు బాగా నచ్చి ఆ టీమ్ ను ఎలా అయినా అప్రిషియేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్లో ఈ సినిమా చూశాను. ఈ సినిమా డైరెక్టర్ విజయ్ నా దగ్గర మూడు సినిమాలకు అసోసియేట్గా పని చేశాడు. ఎన్నో ట్విస్టులు, టర్న్ లతో ఈ సినిమాను చక్కగా తీశాడు. లాయర్గా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బాగా నటించారు. ఆమె పాత్రకి మంచి అప్రిషియేషన్ వస్తోంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఏదో ఒక సీన్ హార్ట్ టచింగ్గా ఉంది. నరేష్ ఎంత మంచి ఆర్టిస్టో మనందరికీ తెలుసు. రీసెంట్గా మా మహర్షి సినిమాతో, మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా అవార్డ్స్తో పాటు గౌరవాన్ని, డబ్బును కూడా తీసుకొస్తుంది. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఒక మంచి టీమ్తో ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు. నిర్మాత సతీష్గారు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.
కమర్షియల్ సినిమాలు కాదు ఒక మంచి సినిమా చెయ్
చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ''ఏ దర్శకుడికైనా దిల్ రాజుగారి బ్యానర్లో సినిమా చేయాలని లైఫ్ యాంబిషన్గా ఉంటుంది. దిల్ రాజుగారి బ్యానర్లో నేను మూడు సినిమాలకు పని చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు కాదు ఒక మంచి సినిమా చేయి అని చెప్పేవారు. ఇప్పుడు నేను తెరకెక్కించిన ఫస్ట్ మూవీ నాంది నచ్చి ఆయన మా టీమ్ అందరిని అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయి ఈ రోజు ప్రేక్షకుల సపోర్టుతో ఒక మంచి సినిమాగా వెళుతోంది. ఇలాంటి తరుణంలో రాజుగారు సపోర్ట్ లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, సతీష్ గారికి థాంక్యు వెరీ మచ్" అన్నారు.
ఫస్ట్ టైమ్ గెలిచా..
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ - "ఇది నేను పాల్గొంటున్న ఫస్ట్ అప్రిషియేషన్ మీట్. దిల్ రాజుగారి లాంటి ఒక పెద్ద నిర్మాత ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తే నూతన దర్శకులు, నిర్మాతలు ఇంకా మంచి సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా నేను ప్రతి సినిమాలో విలన్గా చేస్తాను కాబట్టి ఒకటి నన్ను చంపుతారు లేదా ఓడిస్తారు.. కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ నేను గెలిచాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, సతీష్ గారికి థాంక్స్" అన్నారు.
నమ్మకంతో నటించాలని తెలిసింది
హీరో నరేష్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఆడడానికి కారణం నమ్మకం మరియు హార్డ్ వర్క్. ఒక దర్శకుడు ఎలాంటి కథతో వచ్చినా మన మీద మనం నమ్మకంతో ఆ క్యారెక్టర్ లోకి వెళ్లి నటించాలని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అలా మనల్ని నమ్మడానికి ఒక మంచి మనుషులు కావాలి అలాంటి వారే విజయ్, సతీష్. మా టీమ్ అందరూ కూడా ఈ కథను నమ్మి 100శాతం హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకు వచ్చారు. దిల్ రాజు గారు ఎప్పుడూ కొత్త టాలెంట్ని, కొత్త డైరెక్టర్స్ ని, కొత్త ఆర్టిస్ట్ లని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా సినిమా చూసి మా టీమ్ అందరినీ అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు మంచి హిట్ పడాలని చాలా మంది కోరుకున్నారు. ఈ సినిమా వారందరికీ డెడికేట్ చేస్తున్నాను" అన్నారు.
బిగ్గెస్ట్ అచీవ్మెంట్
చిత్ర నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ''రామానాయుడుగారు, అల్లు అరవింద్గారు, దిల్ రాజుగారి స్ఫూర్తితో నేను ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. దిల్ రాజుగారు ప్రతిరోజు ఉదయాన్నే సెట్ కి వెళ్లి పొడక్షన్ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకుంటారు. ఆయన్ని స్పూర్తిగా తీసుకొని నేను కూడా ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. నా రోల్ మోడల్గా భావించే దిల్ రాజుగారికి నేను చేసిన మొదటి ప్రయత్నం నచ్చి తనకు తానుగా ముందుకొచ్చి మా టీమ్ని అప్రిషియేట్ చేయడం నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్" అన్నారు.