పాకిస్తాన్కు Digvijay singh కౌంటర్
ABN , First Publish Date - 2021-07-17T19:43:23+05:30 IST
ఇరు దేశాల చర్చల విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా బదులిచ్చారు
భోపాల్: ఇరు దేశాల చర్చల విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా బదులిచ్చారు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు రక్షణ కల్పించినంత కాలం ఇరు దేశాల చర్చలకు ఆటంకం కలుగుతూనే ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముంబైకి ఉగ్రవాదులను పంపిన వారికి రక్షణ కల్పించినంత కాలం ఇరు దేశాల మధ్య చర్చల విషయంలో అపనమ్మకాలు వస్తూనే ఉంటాయని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలకు ఆరెస్సెస్ సైద్ధాంతికతే అడ్డుగా నిలుస్తోందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశమైన భారత్తో సఖ్యతగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నమని, కానీ మధ్యలో ఆరెస్సెస్ భావజాలం వచ్చిచేరిందని ఇమ్రాన్ పేర్కొన్నారు.