సీతయ్యపేట హైస్కూల్‌లో డిజిటల్‌ క్లాసురూమ్‌లు

ABN , First Publish Date - 2022-08-16T06:07:07+05:30 IST

మండలంలోని సీతయ్యపేట జడ్పీ హైస్కూల్‌లో కరూర్‌ వైశ్యాబ్యాంకు రూ.9 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్‌ క్లాసు రూమ్‌లను పరవాడ డీఎస్‌పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు.

సీతయ్యపేట హైస్కూల్‌లో డిజిటల్‌ క్లాసురూమ్‌లు
డిజిటల్‌ క్లాసు రూమ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులు


బుచ్చెయ్యపేట, ఆగస్టు 15: మండలంలోని సీతయ్యపేట జడ్పీ హైస్కూల్‌లో కరూర్‌ వైశ్యాబ్యాంకు రూ.9 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్‌ క్లాసు రూమ్‌లను పరవాడ డీఎస్‌పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌. రమేశ్‌, సీజీఎం పి. చలపతిరావు, జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ వజ్రపు బాబూరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:07:07+05:30 IST