సీతయ్యపేట హైస్కూల్లో డిజిటల్ క్లాసురూమ్లు
ABN , First Publish Date - 2022-08-16T06:07:07+05:30 IST
మండలంలోని సీతయ్యపేట జడ్పీ హైస్కూల్లో కరూర్ వైశ్యాబ్యాంకు రూ.9 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాసు రూమ్లను పరవాడ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు.
బుచ్చెయ్యపేట, ఆగస్టు 15: మండలంలోని సీతయ్యపేట జడ్పీ హైస్కూల్లో కరూర్ వైశ్యాబ్యాంకు రూ.9 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాసు రూమ్లను పరవాడ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్. రమేశ్, సీజీఎం పి. చలపతిరావు, జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ వజ్రపు బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.