అనవసర ప్రశ్నలు వేయొద్దు

ABN , First Publish Date - 2021-07-26T05:29:33+05:30 IST

దిశ యాప్‌ను ఆశ్రయించిన బాధితులను అనవసర ప్రశ్నలు వేయవద్దని పోలీసులకు గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ్‌వర్మ సూచించారు. ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ తప్పక ఉండాలని, ఆయాప్‌పై అందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అనవసర ప్రశ్నలు వేయొద్దు
మాట్లాడుతున్న డీఐజీ త్రివిక్రమ్‌వర్మ

ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ ఉండాలి

డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ

నెల్లూరు(క్రైం), జూలై 25: దిశ యాప్‌ను ఆశ్రయించిన బాధితులను అనవసర ప్రశ్నలు వేయవద్దని పోలీసులకు గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ్‌వర్మ సూచించారు. ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ తప్పక ఉండాలని, ఆయాప్‌పై అందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎప్పీ సీహెచ్‌ విజయరావు, సబ్‌డివిజన్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు దిశ యాప్‌పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని పెండింగ్‌ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని, ముఖ్యంగా ఫోక్సో కేసుల్లో  జాప్యం లేకుండా చూడాలని, వారం లోపు చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2021-07-26T05:29:33+05:30 IST