కాకినాడలో డీఐజీ తనిఖీ

ABN , First Publish Date - 2020-04-04T11:40:25+05:30 IST

నగరంలో శుక్రవారం ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ

కాకినాడలో డీఐజీ తనిఖీ

కాకినాడ, ఏప్రిల్‌ 3: (ఆంధ్రజ్యోతి): నగరంలో శుక్రవారం ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ అద్నాన్‌నయీం అస్మీ, పోలీస్‌ అధికారులతో ఆయన తొలుత భానుగుడి జంక్షన్‌లో రాకపోకలను గమనించారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రయాణికులను ఆపి ఆరా తీశారు. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని సూచించారు. టూ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌, మెయిన్‌ రోడ్డు, జడ్పీ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T11:40:25+05:30 IST