పుట్టింటిపై బెంగతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-05T10:39:24+05:30 IST

రెడ్డివారిపల్లె గ్రామం గౌనుపల్లె వాసి జైష్ణ (30) పుట్టింటిపై బెంగతో మనస్థాపం చెంది శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది.

పుట్టింటిపై బెంగతో వివాహిత ఆత్మహత్య

సంబేపల్లె, జూన్‌ 4: రెడ్డివారిపల్లె గ్రామం గౌనుపల్లె వాసి జైష్ణ (30) పుట్టింటిపై బెంగతో మనస్థాపం చెంది శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. కడప చిన్నచౌకు శ్రీకృష్ణదేవరాయ నగర్‌ వాసి అంగన్వాడీ సూపర్‌వైజర్‌ సావిత్రి కుమార్తె జైష్ణను సంబేపల్లె మండలం గొల్లపల్లె గ్రామం గౌనిప ల్లె విష్ణువర్థన్‌తో నాలుగేళ్ల కిందట వివాహం చేశారు. అప్పటి నుంచీ పుట్టింట్లోనే ఉంటూ సంసారం సాగించినట్లు తెలిపారు. ఇటీవల ప్రభుత్వ వైన్‌ షాపుల్లో విష్ణువర్థన్‌కు ఉద్యోగం రావడంతో ఉద్యోగరీత్యా ఇక్కడే ఉం డాలని వచ్చింది. పుట్టింటిపై బెంగ పెట్టుకుని బుధవారం కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున ్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-06-05T10:39:24+05:30 IST