తెలంగాణకు బీజేపీ ఏమైనా చేసిందా: తలసాని
ABN , First Publish Date - 2021-01-21T19:32:31+05:30 IST
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీని
కరీంనగర్: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీని ఘాటుగా విమర్శించారు. నిధులు విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగానే చూడాలని తలసాని కేంద్రానికి హితవు పలికారు. గురువారం తలసాని ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి అధిక నిధులు వెళుతున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి దానిలో సగం నిధులు కూడా రావడం లేదన్నారు.
కరోనా సమయంలో కూడా తెలంగాణను కేంద్రం ఆదుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏమీ పాకిస్తాన్లోలేదని, భారతదేశంలోనే తెలంగాణ కూడా అంతర్భాగమనే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు గమనించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే సంజయ్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధిని మించి సీఎం కేసీఆర్ పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడన్నారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఏడవడం తప్ప తెలంగాణకు బీజేపీ ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు.