కేంద్రంలో నియంత.. రాష్ట్రంలో సామంతరాజు!
ABN , First Publish Date - 2022-01-27T08:31:05+05:30 IST
ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో నియంత పాలన కొనసాగుతుంటే.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సామంతరాజులా పాలన సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
- మోదీ, కేసీఆర్ పాలనపై రేవంత్రెడ్డి మండిపాటు
- గాంధీభవన్లో గణతంత్ర వేడుకలు
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో నియంత పాలన కొనసాగుతుంటే.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సామంతరాజులా పాలన సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో.. పౌరుల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమకారులు, మేధావులు, నిరుద్యోగులు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్లో బుధవారం రేవంత్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు ేస్వచ్ఛ, సామాజిక న్యాయం అందించేందుకు కాంగ్రెస్ పోరాడిందని గుర్తు చేశారు. అంబేడ్కర్ నేతృత్వంలో ఆమోదించుకున్న రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులు కల్పించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల హక్కులకు రక్షణ ఉంటుందని అన్నారు.