రేపటి నుంచి డయల్ యువర్ పీడీ
ABN , First Publish Date - 2020-06-07T06:34:52+05:30 IST
పొదుపు మహిళల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్యువర్ పీడీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహిస్తున్నామని డీఆర్డీఏ పీడీ వీకే శీనానాయక్
- డీఆర్డీఏ పీడీ శీనానాయక్
నెల్లూరు(హరనాథఫురం), జూన్ 6 : పొదుపు మహిళల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్యువర్ పీడీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహిస్తున్నామని డీఆర్డీఏ పీడీ వీకే శీనానాయక్ తెలిపారు. శనివారం డీఆర్డీఏ పథకాల అమలు తీరుపై డీఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ఈ కార్యక్రమాన్న వాయిదా వేశామని, సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వచ్చే అర్జీలను జిల్లాస్థాయి యాంకర్ పర్సన్స్ అదేరోజు సాయంత్రం లోగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కరించాలన్నారు. ప్రతి మండలంలోని మండల సమాఖ్య కార్యాలయంలో డయల్ యువర్ పీడీ నెంబరు 0861-2335233ను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో ఏపీఎంలు శశిధర్, సోమయాజులు, పీఎం రాజు, డీపీఎంలు కామాక్షి మంజుల, రవికుమార్, జిల్లా యాంకర్ పర్సన్స్ పాల్గొన్నారు.