రూ.11.05 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు : జేసీ మాధవీలత

ABN , First Publish Date - 2020-11-29T06:07:55+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో రూ.11.05 కోట్ల విలువైన 5873.96 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీ లత పేర్కొన్నారు.

రూ.11.05 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు : జేసీ మాధవీలత

విజయవాడ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో రూ.11.05 కోట్ల విలువైన 5873.96 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీ లత పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వ హించిన డయల్‌ యువర్‌ జేసీలో 21 ఫోన్‌కాల్స్‌ను స్వీకరించగా 7 మాత్రమే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉన్నాయి. ఇప్పటి వరకు 674 మంది రైతుల నుంచి రూ.11.05 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 97 మంది రైతులకు రూ.1.73 కోట్లు చెల్లించామన్నారు. చాట్రాయి, ఘంటశాల, తిరువూరు, కంచికచర్ల, విజయవాడ రూరల్‌ ప్రాంతాల నుంచి ఫోన్‌లో రైతులు లేవనెత్తిన సందేహాలను ఆమె నివృత్తి చేశారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ కె.రాజ్యలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:07:55+05:30 IST