అభివృద్ధి చేతగానివాళ్లు మాకు అడ్డుతగులుతున్నారు: ధూళిపాళ్ల
ABN , First Publish Date - 2022-06-11T20:49:09+05:30 IST
అభివృద్ధి చేతగానివాళ్లు తమకు అడ్డుతగులుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో డెయిరీ
అమరావతి: అభివృద్ధి చేతగానివాళ్లు తమకు అడ్డుతగులుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో డెయిరీ నిధులతో రోడ్డు వేస్తే శిలాఫలకం ధ్వంసంచేస్తారా? అని ప్రశ్నించారు. రూ.29.52 లక్షల సంగం డెయిరీ నిధులతో రోడ్డు నిర్మించామని, రహదారిని జీవీ అంజనేయులు ఈనెల 9న ప్రారంభించారని తెలిపారు. బాధ్యత లేనివాళ్లు శిలాఫలకం ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.