ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు: దూళిపాళ్ళ

ABN , First Publish Date - 2022-01-02T18:24:31+05:30 IST

ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు చెబుతున్నారని టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు: దూళిపాళ్ళ

అమరావతి: ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు చెబుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫించన్ రూ.250 పెంచి పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రూ. 500 ఉన్న ఫించన్ వేయి రూపాయలు చేసి ఆపై వేయి నుంచి రూ. 2 వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 54 లక్షల మందికి ఫించన్ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. అసత్యాల ప్రచారానికి సీఎం జగన్ తెరతీశారని దూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు.

Updated Date - 2022-01-02T18:24:31+05:30 IST