దుల్హన్‌ పథకం ఎత్తివేత అన్యాయం

ABN , First Publish Date - 2022-06-25T06:09:03+05:30 IST

దుల్హన్‌ పథకం ఎత్తివేత అన్యాయం

దుల్హన్‌ పథకం ఎత్తివేత అన్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న మైనారిటీ నాయకుడు షేక్‌ బుజ్జి

పెనమలూరు, జూన్‌ 24: దుల్హన్‌ పథకం ఎత్తివేయడం అన్యాయమని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ బుజ్జి అన్నారు. శుక్రవారం అశోక్‌ నగర్‌లోని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా షేక్‌ బుజ్జి, వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో ఉన్న పథకాలన్నిటినీ తొలగిస్తూ వస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వాలే పథకాలను ప్రవేశపెట్టాయన్నారు. దుల్హన్‌ పథకం ఎత్తివేతతో ముస్లింలకు అన్యాయం చేశారన్నారు. సమావేశంలో నాయకు లు షేక్‌ షకీల, అంగిరేకుల మురళి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:09:03+05:30 IST