ధోనీ బిజినెస్కు బర్డ్ఫ్లూ దెబ్బ!
ABN , First Publish Date - 2021-01-14T09:54:32+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తన ఫామ్ హౌస్లో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. ఈ నేపథ్యంలో రెండు వేల చొప్పున కడక్నాథ్, గ్రామప్రియ కోడి పిల్లలను ధోనీ ఫామ్ ఆర్డర్ చేసింది...
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తన ఫామ్ హౌస్లో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. ఈ నేపథ్యంలో రెండు వేల చొప్పున కడక్నాథ్, గ్రామప్రియ కోడి పిల్లలను ధోనీ ఫామ్ ఆర్డర్ చేసింది. కానీ, బర్డ్ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ ఆర్డర్ను రద్దు చేసుకోక తప్పలేదు. కొన్ని రోజుల క్రితం మహీకి చెందిన ఫామ్ నుంచి కడక్నాథ్ కోడి పిల్లల కోసం ఆర్డర్ వచ్చిందని మధ్యప్రదేశ్కు చెందిన ఓ అధికారి తెలిపాడు.