వాష్రూమ్లో ధోనీ పాట.. వైరల్ అవుతోన్న వీడియో..
ABN , First Publish Date - 2020-02-20T00:19:12+05:30 IST
తనను మించిన కూలెస్ట్ పర్సన్ మరొకరు లేరంటూ టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ ధోనీ మరోసారి నిరూపించాడు. గత ఆరు నెలలుగా క్రికెట్కు, టీమిండియాకు దూరంగా ఉన్న ధోనీ.. తన సమయాన్ని కుటుంబ సభ్యులతో
ముంబై: తనను మించిన కూలెస్ట్ పర్సన్ మరొకరు లేరంటూ టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ ధోనీ మరోసారి నిరూపించాడు. గత ఆరు నెలలుగా క్రికెట్కు, టీమిండియాకు దూరంగా ఉన్న ధోనీ.. తన సమయాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతూ, కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా వాష్ రూమ్లో ధోనీ తన స్నేహితులతో కలిసి పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో టీమిండియా క్రికెటర్లు పీయూష్ చావ్లా, పార్థీవ్ పటేల్ ఇతర మిత్రులతో కలిసి వాష్రూమ్లో ఉన్న ధోనీ.. బాలీవుడ్ ఫేమస్ సినిమా అయిన ‘‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’’లోని ‘మేరే మెహబూబ్ ఖయామత్ హోగీ’ పాటను పాడుతూ ఎంజాయ్ చేశాడు. ఆ పాట ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు.. ధోనీ ఎప్పటికీ కూలెస్ట్ పర్సన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అభిమానులు క్రీజ్లో ధోనీని చూడాలంటూ తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.