IPL: మళ్లీ చెలరేగిన కాన్వే.. ఢిల్లీ ఎదుట కొండంత లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-09T03:10:21+05:30 IST
ఢిల్లీ సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్లో చెన్నై చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి
ముంబై: ఢిల్లీ సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్లో చెన్నై చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. డెవోన్ కాన్వే మరోమారు బ్యాట్తో వీరంగమేశాడు. 49 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు.
జడేజా ప్లేస్లో వచ్చిన శివం దూబే 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, ధోనీ 8 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ (Delhi Capitals) బౌలర్లలో అన్రిక్ నార్జ్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు.