Dhoni మళ్లీ తండ్రి కాబోతున్నాడా..? భార్య Sakshi అలా కనిపించడంతో నెట్టింట ఫొటోలు వైరల్..!
ABN , First Publish Date - 2021-10-16T23:22:08+05:30 IST
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్కు నాలుగో సారి ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను అందించాడు. అభిమానులను కానుకను అందించాడు.
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్కు నాలుగో సారి ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను అందించాడు. అభిమానులను కానుకను అందించాడు. అయితే దీంతో పాటు ధోని మరో శుభవార్తను అభిమానులకు వినిపించనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు కారణం నెట్టింట వైరల్ అవుతున్న ధోనీ భార్య సాక్షి ఫొటోలే. ఇంతకీ అసలు విషయం ఏంటనే కదా మీ డౌటు..
చెన్నై విజయానంతరం ధోని భార్య సాక్షి ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ ఫొటోల్లో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె మళ్లీ తల్లి కాబోతోందా..? అని నెట్టింట అభిమానుల మధ్య చర్చలు మొదలయ్యాయి. త్వరలోనే ధోని తండ్రి కాబోతున్నాడన్న వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. అయితే ఇది నిజమో, కాదో అన్నదానిపై ధోని, సాక్షి ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. సాక్షి ప్రెగ్నెంట్ అని , ఆ కుటుంబంలోకి 2022లో కొత్త సభ్యుడు రాబోతున్నాడని సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా చెప్పినట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ వార్త వెలువడిన నాటి నుంచి సోషల్ మీడియాలో సాక్షి, ధోనికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, ధోనికి 2015లో ఒక కూతురు జన్మించింది. ఆమెకు జీవా అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ను భారత్ ఆ సమయంలోనే ఆడింది. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉండటంతో ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లకు హాజరు కాలేదు. అనంతరం మూడు నెలలకు జీవాని ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ, ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు జీవాతో సహా సాక్షి కూడా హాజరయింది.