డీహెచ్ఎఫ్ఎల్ కేసు... ఎన్సీఎల్టీ ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీ తాజా ఆదేశాలు...
ABN , First Publish Date - 2022-01-30T23:28:27+05:30 IST
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్ల అక్రమాలకు సంబంధించి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) గతంలో ఇచ్చిన ఆదేశాల విషయం తెలిసిందే. కాగా తాజాగా... ఈ ఆదేశాలపై... ఎన్సీఎల్ఏటీ స్పందించింది.
ముంబై : దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్ల అక్రమాలకు సంబంధించి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) గతంలో ఇచ్చిన ఆదేశాల విషయం తెలిసిందే. కాగా తాజాగా... ఈ ఆదేశాలపై... ఎన్సీఎల్ఏటీ స్పందించింది. ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. కంపెనీ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ తన ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.కాగా... కంపెనీ చేసిన రెండో ఆఫర్కు సానుకూలంగా స్పందించే అవకాశమున్నట్లు ఈ నేపధ్యంలో... సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. అప్పట్లో కేపీఎంజీ ఫోరెన్సిక్ ఆడిట్లో బయట పడ్డ డీహెచ్ఎఫ్ఎల్ అక్రమాలు బయటపడ్డ విషయం తెలిసిందే. బ్యాంకుల తరఫున కేపీఎంజీ ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రమోటర్లు రూ. 20 వేల కోట్లు దారి మళ్లించారని తేలింది. వ్యాపారం పేరుతో బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో ప్రమోటర్లు దాదాపు రూ. 20 వేల కోట్లను దారిమళ్లించినట్టు వెల్లడైంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
బ్యాంకుల తరఫున కేపీఎంజీ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ విషయం బయటపడింది. అయితే ఈ వార్తలపై కంపెనీగానీ, కేపీఎంజీగానీ అధికారికంగా స్పందించలేదు. కంపెనీ ఖాతాలు అనుమానాస్పదంగా ఉండడంతో డిహెచ్ఎ్ఫఎల్కు రుణాలు ఇచ్చిన బ్యాంకులు నిరుడు ఫిబ్రవరిలో కేపీఎంజీ ద్వారా ఫోరెన్సిక్ ఆడిటింగ్కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ‘మేము ఇంకా ఈ నివేదిక చూడలేదు. అయితే డీహెచ్ఎ్ఫఎల్ రుణాలు సమకూర్చిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అసలు విలువ-కంపెనీ అంచనా వేసిన ప్రాజెక్టు విలువ మధ్య తేడాలు ఉన్నాయి’ అని ఓ బ్యాంకర్ పేర్కొన్నారు. కాగా... నిధుల దారి మళ్లింపు నేపధ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ రుణ పునర్వవస్థీకరణ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. నిరుడు జూలై నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ. 83,873 కోట్లుగా ఉంది. అందులో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ. 38,342 కోట్లు. కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని ఈక్విటీలో 51 శాతంగా మార్చేందుకు బ్యాంకులు సూత్రప్రాయంగా అంగీకరించాయి కూడా.
మొత్తంమీద కంపెనీ పునర్వవస్థీకరణ నిలిచిపోయిన నేపధ్యంలో, బ్యాంకులు ఏకంగా కంపెనీ యాజమాన్యం మార్పునకు పట్టుబట్టిన విషయం తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ అనుబంధ సంస్థ ఎసెన్షియల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్(ఈహెచ్పీఎల్), చరక్ ఫార్మా కంపెనీ మధ్య జరిగిన రూ. 121 కోట్ల ఆర్థిక లావాదేవీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించిన విషయం తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్... చరక్ ఫార్మా మహారాష్ట్ర మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే అల్లుడు రాజ్ షరాఫ్ నిర్వహణలోని కంపెనీ కావడం విశేషం. ఈహెచ్పీఎల్ కంపెనీ, చరక్ ఫార్మా కంపెనీకి ముంబైలోని ఒక ఏడంతస్తుల వాణిజ్య భవనాన్ని చరక్ ఫార్మా కంపెనీకి రూ. 121 కోట్లకు విక్రయించి రిజిస్ట్రేషన్లో మాత్రం రూ. 7 కోట్లుగా చూపించినట్లుగా ఆరపోణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలిలా ఉన్నాయి
ఈహెచ్పీఎల్ అనేది ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ అనుబంధ సంస్థ. ఈ సంస్థకు డీహెచ్ఎ్ఫఎల్ ప్రమోటర్ అయిన ధీరజ్ వాద్వాన్ ప్రమోటర్, హోల్ టైమ్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండటం గమనార్హం. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం ముఠాతో ఉన్న సంబంధాలూ బయట పడుతున్నాయి. ఈడీ అధికారులు ఇటీవల 14 చోట్ల జరిపిన సోదాల్లో డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీనీ ఇక్బాల్ నిర్వహణలోని సన్బ్లింక్ రియల్ ఎస్టేట్ కంపెనీకి 2010లో రూ. 2,186 కోట్ల రుణాలు ఇచ్చినట్లుగా ఉన్న పత్రాలు బయట పడ్డాయి. ఆయన గతంలో ముంబైలో దావూద్ ఇబ్రహీం బృందంలో ముఖ్యుడని అప్పనట్లో తారస్థాయిలో వినిపించింది.