ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సాగునీటి విడుదల నిలిపివేత

ABN , First Publish Date - 2021-04-17T16:43:26+05:30 IST

నేటి నుంచి గోదావరి తూర్పు డెల్టాకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సాగునీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 20 వరకు

ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సాగునీటి విడుదల నిలిపివేత

రాజమండ్రి: నేటి నుంచి గోదావరి తూర్పు డెల్టాకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సాగునీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 20 వరకు మధ్య, పశ్చిమ డెల్టాల కాల్వల ద్వారా రబీ పంటకు సాగునీరు సరఫరా నిలిపివేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం మార్చి 31 వరకు గోదావరి డెల్టా కాల్వలు కట్టివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుల విజ్ఞప్తి మేరకు  ఈనెల 20 వరకూ నీటి  విడుదలను పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-04-17T16:43:26+05:30 IST