ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర పెరిగిన గోదావరి వరద

ABN , First Publish Date - 2021-07-22T14:06:28+05:30 IST

గ‌త రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు. మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావ‌రి

ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర పెరిగిన గోదావరి వరద

రాజమండ్రి: గ‌త రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావ‌రి న‌దికి వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి. దీంతో గ్రామంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 

Updated Date - 2021-07-22T14:06:28+05:30 IST