floods: ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి
ABN , First Publish Date - 2022-08-14T21:22:16+05:30 IST
ధవళేశ్వరం బ్యారేజ్ (Dhavaleshwaram Barrage) దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. 175 గేట్లు ఎత్తి 14.40 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజ్ (Dhavaleshwaram Barrage) దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. 175 గేట్లు ఎత్తి 14.40 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలన్నీ గోదారి కష్టాలకు ఎదురీదుతున్నాయి. నెల రోజులుగా పదుల సంఖ్యలో గ్రామాల్లో పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, ఆఖరుకు రేషన్ కూడా లేకపోయింది. కరెంటు సరఫరా సంగతి చెప్పనక్కర్లేదు. మళ్ళీ ముంచు కొచ్చిన గోదావరి వరదలతో అంతా విలవిలలాడు తున్నారు. వేలేరుపాడు మండలం సగభాగం వరదకు చేరువైంది. వీరందరి కష్టాలు చెప్పనలవి కావు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా గుణపాఠం నేర్చుకుంటారనుకున్నా యంత్రాంగంలో అదేదీ మచ్చుకైనా కనిపించడం లేదు.