కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

ABN , First Publish Date - 2022-05-25T06:21:32+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా
వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

ఎల్లారెడ్డిపేట, మే 24:  ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో  ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురిస్తోందన్నారు. ఇసుక రవాణా చేస్తున్న లారీలను కట్టడి చేయాలని, ధాన్యాన్ని తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బస్తాకు 43 కిలోల ధాన్యం తూకం వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తహసీల్‌ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గిరిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మధు, పోచయ్య, రాములు, రవీందర్‌, రాజునాయక్‌, సత్తయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:21:32+05:30 IST