ప్రభుత్వ భూమిలో ఆక్రమణ తొలగించాలని ధర్నా
ABN , First Publish Date - 2021-06-14T05:32:12+05:30 IST
మండలంలోని శ్రీరాంపురం ఎస్సీ కాలనీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, ఆక్రమ ణదారుడిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామంలోని దళితులు ఆదివారం సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
పాయకరావుపేట రూరల్, జూన్ 13 : మండలంలోని శ్రీరాంపురం ఎస్సీ కాలనీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, ఆక్రమ ణదారుడిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామంలోని దళితులు ఆదివారం సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబరు 12/4లో ఉన్న పదిహేడు సెంట్ల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆక్రమించుకుని, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించకున్నాడని ఆరో పించారు. వెంటనే అధికారులు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎన్.ప్రసాద్, పి.నాగరాజు, శివకుమార్, కామరాజు, శేషారత్నం, చిట్టిబాబు, సత్యవతి, అప్పలకొండ తదితరులు కోరారు.