‘గిరిజన గ్రామాలను ఐటీడీఏలో చేర్చాలని ధర్నా’

ABN , First Publish Date - 2021-11-30T06:09:21+05:30 IST

మండలంలోని గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆది వాసీ హక్కుల సాధన సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

‘గిరిజన గ్రామాలను ఐటీడీఏలో చేర్చాలని ధర్నా’
గొలుగొండలో ధర్నా చేస్తున్న నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజనులు

గొలుగొండ, నవంబరు 29 : మండలంలోని గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆది వాసీ హక్కుల సాధన సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సం ఘం జిల్లా అధ్యక్షుడు నల్లి కళ్యాణం మాట్లాడుతూ ఈ ప్రాంత గిరిజను లను ఐటీడీఏలో విలీనం చేయకపోవడం వల్ల అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు. వెంటనే గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక ప్రతినిధి బొట్టా నాగరాజు, మండల నాన్‌ షెడ్యూల్‌ సంఘం అధ్య క్షుడు ఎన్‌.చిరంజీవి, సీపీఎం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T06:09:21+05:30 IST