పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2022-01-26T05:02:51+05:30 IST

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ జోన్‌ 8 ఉద్యోగులు ధర్నా చేశారు.

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ధర్నా
వేపగుంట జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు

వేపగుంట, జనవరి 25: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ జోన్‌ 8 ఉద్యోగులు ధర్నా చేశారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం ఉదయం ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వో నారాయణరావు, సూపరింటెండెంట్‌ పి.వి.వి.ఎస్‌.మూర్తి, ఏపీడీ బొజ్జ ప్రసాదరావు, శానిటరీ సూపర్‌వైజర్‌ వెన్నెల అప్పారావు, జగ్గునాయుడు, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:02:51+05:30 IST