ఉక్కు పరిరక్షణకు ఏకం కావాలి
ABN , First Publish Date - 2021-02-27T06:40:57+05:30 IST
విశాఖ ఉక్కు పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు ముందుకు రావాలని కార్మిక సంఘ నాయకు లు పిలుపు నిచ్చారు.
తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు ముందుకు రావాలని కార్మిక సంఘ నాయకు లు పిలుపు నిచ్చారు. స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ అనుబంధ కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొన్నాయి. ఏఐటీయుసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాలు ఒకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూ సీ నాయకులు పాల్గొన్నారు.