పెట్రో ధరలు తగ్గించాలని ధర్నా

ABN , First Publish Date - 2021-10-29T03:07:48+05:30 IST

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలంటూ స్థానిక టవర్‌క్లాక్‌ కేంద్రం వద్ద గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

పెట్రో ధరలు తగ్గించాలని ధర్నా
ధర్నా చేస్తున్న వామపక్ష నాయకులు

గూడూరు, అక్టోబరు 28:  పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలంటూ స్థానిక టవర్‌క్లాక్‌ కేంద్రం వద్ద గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.  ధరలను తగ్గించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో యాదగిరి, మణి, శివయ్య, ముత్యాలయ్య, బీవీ రమణయ్య, ప్రసాద్‌, శ్రీనివాసులు, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T03:07:48+05:30 IST