బీజేపీ నాయకుల ధర్నా

ABN , First Publish Date - 2022-07-01T06:31:39+05:30 IST

బీజేపీ నాయకుల ధర్నా

బీజేపీ నాయకుల ధర్నా
ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు


తాండూరు, జూన్‌ 30 : తాండూరు మునిసిపాలిటీ కార్యాలయం ఎదుట గురువారం బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. నూపుర్‌శర్మపై చర్యలు తీసుకునేందుకు మునిసిపల్‌ కౌన్సిల్‌ ద్వారా తీర్మానం చేయాలని నిర్ణయించి, ఆ అంశాన్ని ఎజెండాలో చేర్చడం పట్ల బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారిని పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ధర్నాలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌, బీజేపీ పట్టణాధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌,  పార్టీ సీనియర్‌ నాయకులు పూజారిపాండు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:31:39+05:30 IST