జీతాలివ్వాలని ‘గాంధీ’ సెక్యూరిటీ గార్డుల నిరసన

ABN , First Publish Date - 2022-08-11T06:14:50+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీగార్డులకు వెంటనే జీతాలు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షుడు ఎం. నర్సింహ హెచ్చరించారు.

జీతాలివ్వాలని ‘గాంధీ’ సెక్యూరిటీ గార్డుల నిరసన

అడ్డగుట్ట, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీగార్డులకు వెంటనే జీతాలు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షుడు ఎం. నర్సింహ హెచ్చరించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు జీడీఎక్స్‌ కాంట్రాక్టర్‌ రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్‌, ప్రధాన కార్యదర్శి హసీనాబేగం, నగర ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మీబాయి, గాంధీ యూనిట్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:14:50+05:30 IST