20న కలెక్టరేట్ ముట్టడి
ABN , First Publish Date - 2022-01-18T03:58:30+05:30 IST
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న నిర్వహించనున్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు.
గూడూరు, జనవరి 17: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న నిర్వహించనున్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జీఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వేతనాలను తగ్గించిందన్నారు.మధ్యంతర భృతి ఫిట్మెంట్ 23 శాతం ఇవ్వడాన్ని, ప్రస్తుతం ఉన్న ఇంటి అద్దెలను తగ్గించడాన్ని, సీపీఎస్ రద్దు హామీని నిలబెట్టుకోకపోవడాన్ని, 3,4,5 తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, రవి, మల్లికార్జున, సుధీర్, బాబు, మున్వర్బాషా, శివకుమార్, ప్రాణేష్, రమణయ్య, గోపాలయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.