సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కోసం తుర్తి వాసుల ధర్నా

ABN , First Publish Date - 2021-12-09T06:52:35+05:30 IST

మండలంలో తుర్తి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అంబా రిపేట క్రాస్‌ రోడ్డు కోరుట్ల - వేములవాడ రహదారిపై గ్రామస్థులు ధర్నా చేశారు.

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కోసం తుర్తి వాసుల ధర్నా
రాస్తారోకో చేస్తున్న తుర్తి గామస్థులు

కథలాపూర్‌, డిసెంబరు 8: మండలంలో తుర్తి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అంబా రిపేట క్రాస్‌ రోడ్డు కోరుట్ల - వేములవాడ రహదారిపై గ్రామస్థులు ధర్నా చేశారు. రోడ్డుపై గ్రామస్థులు విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడారు. సెల్‌ఫోన్‌ సింగ్నల్‌ లేకపోవడంతో అత్యసర సేవలు అందడం లేదని వాపోయారు.  టెలికం అధికారులు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అరోపించారు. ఎమ్మెల్యే రమేష్‌బాబు దత్తత తీసుకున్న తుర్తి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కొలకని శేఖర్‌, ఎంపిటిసి వేముల గంగారాజం విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T06:52:35+05:30 IST