మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటి వద్ద ధర్నా

ABN , First Publish Date - 2020-06-07T07:09:42+05:30 IST

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను మో సం చేసి, లారీలను కొని పించారంటూ ఆయన అనుచరుడు

మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటి వద్ద ధర్నా

వాహనాల విక్రయంలో మోసంపై కేసు నమోదు


తాడిపత్రి, జూన్‌ 6: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను మో సం చేసి, లారీలను కొని పించారంటూ ఆయన అనుచరుడు నాగేశ్వర్‌రెడ్డి శనివారం జేసీ నివాసం వద్ద ధర్నాకు దిగారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీఎస్‌-3 లారీలను కొని, బీఎస్‌-4గా మార్చి తనకు విక్రయించారన్నారు. అనంతరం వాటిని తాను ఇతరులకు విక్రయించానన్నారు. ప్రస్తుతం ఆ లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారన్నారు. వాటిని కొన్న వ్యక్తులు తాము చెల్లించిన డబ్బు తిరిగివ్వాలని త నపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయాడు. విషయాన్ని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపో వటంతో ధర్నా చేయాల్సి వచ్చిందన్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని, నాగేశ్వర్‌రెడ్డిని స్టేషన్‌కు తరలించారు. అతడి ఫిర్యాదు మేర కు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-06-07T07:09:42+05:30 IST