ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

ABN , First Publish Date - 2022-07-03T03:41:52+05:30 IST

ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించా లని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం పట్ట ణంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.

ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
రాస్తారోకో చేస్తున్న ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నాయకులు

ఆసిఫాబాద్‌, జూలై 2:ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించా లని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం పట్ట ణంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్‌చౌక్‌లోని హైదరా బాద్‌-నాగ్‌ పూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నాయకులు రేగుంట కేశవరావు, రజీహైదర్‌, నాగరాజు, మహేష్‌, వెంకన్న,అంజన్న, యశోద పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T03:41:52+05:30 IST