విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా
ABN , First Publish Date - 2022-08-12T06:10:27+05:30 IST
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లును వ్యతిరేస్తూ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో చీమలపాడులో ధర్నా నిర్వహించారు.
ఎ.కొండూరు, ఆగస్టు 11 : కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లును వ్యతిరేస్తూ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో చీమలపాడులో ధర్నా నిర్వహించారు. రైతు సంఘం నాయకుడు అమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే వినియోగదారులపై అధిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వం జీవో 22 తీసుకొచ్చి రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందన్నారు. ట్రూ అప్ చార్జీలు, చీకటి జీవోలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి, ఆనందరావు, వెంకటేశ్వరావు, గోపిరాజు, సోములు, లక్ష్మయ్య పాల్గొన్నారు.