ఎన్నికల హామీల అమలులో విఫలం: నర్సింహారెడ్డి
ABN , First Publish Date - 2021-07-29T07:01:40+05:30 IST
ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆరోపించారు.
ఎల్బీనగర్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కిసాన్మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. కిసాన్మోర్చా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు మహే్షయాదవ్, రూరల్ అధ్యక్షుడు రవీందర్రెడ్డిల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్యక్రమంలో కిసాన్మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతికిరణ్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్రెడ్డి, కార్యవర్గ సభ్యుడు కాటం భాస్కర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అందెల శ్రీరాములు, పాపయ్యగౌడ్, అంజయ్యగౌడ్, లచ్చిరెడ్డి, దుబ్బాక నరే్షరెడ్డి, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు.