అమరావతిపై అధర్మంగా మాట్లాడుతున్న ధర్మాన
ABN , First Publish Date - 2022-10-05T08:27:01+05:30 IST
అమరావతిపై అధర్మంగా మాట్లాడుతున్న ధర్మాన
రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగదు: సీపీఐ
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అఽధర్మంగా మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మూడు రాజధానుల పాట పాడటం దుర్మార్గమని ఖండించారు. అమరావతి రైతులను రెచ్చగొట్టే పద్ధతుల్లో మంత్రులు వ్యాఖ్యలు చేయడం తగదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.