Dharmana comments: టీడీపీకి మద్దతిచ్చే వాలంటీర్లను మేమే తీసేస్తాం..ధర్మాన వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-07-22T18:40:59+05:30 IST
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం (Srikakulam): ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasadarao) వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial comments) చేశారు. ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్లను (Volunteers) తప్పించాలన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం, భైరి సింగిపురం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు ఎసరు పెట్టే వాలంటీర్లను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. టీడీపీ(TDP)కి మద్దతుగా ఉన్న వాలంటీర్లు రాజీనామాలు చేయాలని సూచించారు. ఒకవేళ రాజీనామాలు చేయకపోతే తామే తీసేస్తామని హెచ్చరించారు. ‘‘50 కుటుంబాలకు కొడుగ్గా ఉండి.. సాయం చేసి వాళ్లందరిదగ్గర గౌరవం పొందేటివంటి కిరీటం మేము పెడితే.. ప్రభుత్వానికి ఎసరు పెట్టే పని చేస్తే.. ఎందుకుండాలి రిజైన్ చేస్తే ఇంకొరిని పెట్టుకుంటాం’’ అంటూ వ్యాఖ్యానించారు. అబద్దాలు చెప్పి తిరగడం ఎందుకు? బయటకు వెళ్లి టీడీపీకి ప్రచారం చేసుకోవాలని మంత్రి ధర్మాన అన్నారు.