కొంతమంది వ్యక్తులను మంత్రులను చేస్తే.. సామాజిక న్యాయం జరగదు: ధర్మాన

ABN , First Publish Date - 2022-05-26T16:14:42+05:30 IST

రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులను మంత్రులను చేస్తే..

కొంతమంది వ్యక్తులను మంత్రులను చేస్తే.. సామాజిక న్యాయం జరగదు: ధర్మాన

శ్రీకాకుళం : రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులను మంత్రులను చేస్తే.. సామాజిక న్యాయం జరగదన్నారు. అన్నివర్గాల వారికి సంక్షేమం అందించడమే సామాజిక న్యాయమన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. బస్సు యాత్రలో భాగంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామని ధర్మాన తెలిపారు.

Updated Date - 2022-05-26T16:14:42+05:30 IST