రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్మపరిరక్షణ యాత్ర: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-01-21T22:10:15+05:30 IST

శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్మపరిరక్షణ యాత్ర: అచ్చెన్నాయుడు

తిరుపతి: శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ధర్మం, న్యాయం చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ముసుగేసుకుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కులాలు, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. జిల్లాల నుంచి కలెక్షన్లు వసూలు చేసే బిల్లు కలెక్టర్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.


టీడీపీ అధినేత చంద్రబాబు.. పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 700 గ్రామాల్లో పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో పార్టీకి చెందిన నేతలందరూ తప్పకుండా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాలయాలపై దాడులను హైలైట్ చేస్తూనే.. ఏడాదిన్నర వైసీపీ పాలనను ఎండగట్టాలని నేతలకు సూచించారు.

Updated Date - 2021-01-21T22:10:15+05:30 IST