పెట్రో ధరలు తగ్గించాలని ధర్నా
ABN , First Publish Date - 2021-06-19T01:45:32+05:30 IST
పెట్రోలు, డీజిల్ఽ దరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక టవర్క్లాక్ కేంద్రం వద్ద శుక్రవారం వారు ధర్నా చేశారు.
గూడూరురూరల్, జూన్ 18: పెట్రోలు, డీజిల్ఽ దరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక టవర్క్లాక్ కేంద్రం వద్ద శుక్రవారం వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ సెకండ్వేవ్ కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను అమాంతం పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు కాలేషా, యాదగిరి, సీవీఆర్ కుమార్, ఎంబేటి చంద్రయ్య, కేశవులు, మణి, వెంట్రామిరెడ్డి, చంద్రయ్య, బీవీరమణయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.