ధరలు పెంచి ప్రజలపై భారం మోపారు : బొల్లినేని
ABN , First Publish Date - 2022-04-29T03:30:52+05:30 IST
రాష్ట్రంలో విద్యుత్, బస్సు చార్జీలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిం
సీతారామపురం, ఏప్రిల్ 28 : రాష్ట్రంలో విద్యుత్, బస్సు చార్జీలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆరోపించారు. ఆయన గురువారం సీతారామపురంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం హత్య, అత్యాచార బాధితులకు సంఘీభావంగా గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
ఇఫ్తార్ విందులో బొల్లినేని
స్ధానిక జామియా మసీదులో ముస్లింలు గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని , చెంచలబాబుయాదవ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ కప్పా ప్రభాకర్రాజు, మాజీ జడ్పీటీసీ జ్యోతి, నాయకులు జాషువా, చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.